ETV Bharat / state

గట్టుబూత్కూరులో వృద్ధురాలి దారుణ హత్య

author img

By

Published : Mar 23, 2020, 9:04 AM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూరులో ఈ ఘటన జరిగింది. కరీంనగర్​ సీపీ కమలాసన్​ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.

Murder
Murder

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కురులో కంకనాల కౌసల్య(75) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని చూసిన పక్కింటి మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

డాగ్ స్క్వాడ్​తో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసుల బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ వెల్లడించారు.

గట్టుబూత్కూరులో వృద్ధురాలి దారుణ హత్య

ఇదీ చూడండి : అర్ధరాత్రయినా అదే అప్రమత్తత... కరోనాపై అలుపెరుగని పోరాటం

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కురులో కంకనాల కౌసల్య(75) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని చూసిన పక్కింటి మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

డాగ్ స్క్వాడ్​తో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసుల బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ వెల్లడించారు.

గట్టుబూత్కూరులో వృద్ధురాలి దారుణ హత్య

ఇదీ చూడండి : అర్ధరాత్రయినా అదే అప్రమత్తత... కరోనాపై అలుపెరుగని పోరాటం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.