ETV Bharat / state

మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ

గతవైభావాలకు గుర్తు ఆ కోట... చూడగానే అలనాటి రాజుల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. ఖిల్లా చుట్టూ ప్రహారి గోడ... ఏ వైపు నుంచి శత్రువు ప్రవేశించలేడు. విశాలమైన మైదానం... అక్కడి నుంచి కిందికి చూస్తే పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అది ఎక్కడా ఉందో అనుకుంటున్నారా.... కరీంనగర్​కు, వరంగల్​కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

author img

By

Published : Feb 14, 2019, 4:22 PM IST

మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ
మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ
మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళఒకవైపు కరీంనగర్​ జిల్లా కేంద్రానికి 35కిలోమీటర్ల దూరంలో, మరోవైపు వరంగల్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది మొలంగూర్ ఖిల్లా. ఎలగందుల, కాకతీయుల కోటల మధ్యలో ఈ ఖిల్లా ఉంటుంది. దీని నిర్మాణాన్ని ఎవరు పట్టించుకోక.. శిథిలమైపోతున్న వేళ.. అధికారులు దృష్టిసారించారు. మరమ్మతులు చేపట్టి పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కోటకు కొత్తశోభ సంతరించుకుంటోంది. రెండుగుట్టల మధ్య ఉన్న ఈ కోటకు తూర్పు పడమరల్లో రెండు ద్వారాలున్నాయి. కొంతదూరం వరకు పైకి ఎక్కడానికి రాతిమెట్లు ఉన్నా.. ఆ తర్వాత పైకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేదు. ఎంతో ఖ్యాతి ఉన్న మొలంగూరు కోటను పట్టించుకునే వారు లేక... తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కోటను పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కోటల మాదిరిగా దీనిని పర్యటక కేంద్రంగా మార్చారు. కోట పైభాగంలో చుట్టూ ప్రహరీగోడతో పాటు మరఫిరంగులు, ట్రెకింగ్​కు వీలు కల్పించే విధంగా గుట్టలున్నాయి. సాహస క్రీడలు నేర్చుకోడానికి వీలుగా శిక్షకులను ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారు. ఈ ఖిల్లా దిగువన ఓ దూద్ బావి ఉంది. అందులోని నీరు స్వచ్ఛగా ఉంటాయని, వేసవిలోనూ నిండుగా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయుర్వేద గుణాలున్న ఈ బావి నీటిని తీసుకెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చారిత్రక కోట శిథిలమౌతున్న వేళ... ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడమే కాకుండా పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
undefined

మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళ
మొలంగూర్‌ ఖిల్లాకు కొత్త కళఒకవైపు కరీంనగర్​ జిల్లా కేంద్రానికి 35కిలోమీటర్ల దూరంలో, మరోవైపు వరంగల్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది మొలంగూర్ ఖిల్లా. ఎలగందుల, కాకతీయుల కోటల మధ్యలో ఈ ఖిల్లా ఉంటుంది. దీని నిర్మాణాన్ని ఎవరు పట్టించుకోక.. శిథిలమైపోతున్న వేళ.. అధికారులు దృష్టిసారించారు. మరమ్మతులు చేపట్టి పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కోటకు కొత్తశోభ సంతరించుకుంటోంది. రెండుగుట్టల మధ్య ఉన్న ఈ కోటకు తూర్పు పడమరల్లో రెండు ద్వారాలున్నాయి. కొంతదూరం వరకు పైకి ఎక్కడానికి రాతిమెట్లు ఉన్నా.. ఆ తర్వాత పైకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేదు. ఎంతో ఖ్యాతి ఉన్న మొలంగూరు కోటను పట్టించుకునే వారు లేక... తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కోటను పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కోటల మాదిరిగా దీనిని పర్యటక కేంద్రంగా మార్చారు. కోట పైభాగంలో చుట్టూ ప్రహరీగోడతో పాటు మరఫిరంగులు, ట్రెకింగ్​కు వీలు కల్పించే విధంగా గుట్టలున్నాయి. సాహస క్రీడలు నేర్చుకోడానికి వీలుగా శిక్షకులను ఏర్పాటు చేశారు. ఉదయం వేళల్లో గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారు. ఈ ఖిల్లా దిగువన ఓ దూద్ బావి ఉంది. అందులోని నీరు స్వచ్ఛగా ఉంటాయని, వేసవిలోనూ నిండుగా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయుర్వేద గుణాలున్న ఈ బావి నీటిని తీసుకెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చారిత్రక కోట శిథిలమౌతున్న వేళ... ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడమే కాకుండా పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
undefined
HYD_TG_48_13_HICC_GOVERNOR_NARASHIMHAN_PKG_C15
note: విజువల్స్ స్క్రిప్టు ఎఫ్ టి పి ద్వారా పంపించడం జరిగింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.