కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రెవల్లి, పెద్దకుర్మపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా రెవల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే రూ.9.20 లక్షలతో నిర్మించనున్న బీసీ కుల సంఘ భవనం, 1.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
అనంతరం పెద్దకుర్మపల్లిలో యాదవ సంఘ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏంపీపీ రవీందర్, ఏఎంసీ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఏఈ విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. కరోనా వల్ల ఏడు నెలలుగా నిలిచిన కంప్యూటర్ శిక్షణ