కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణ, ఎంపీపీ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కశ్మీర్ భద్రత, భవితపై మోదీ భరోసా