ETV Bharat / state

నిలిచిపోయిన తాగునీటి సరఫరా - drinking water stopped in choppadamdi constutency

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. ఫిల్టర్​బెడ్​లో వచ్చే నీరు కలుషితం కావడం వల్ల గ్రామాలకు తాత్కాలికంగా నీటిసరఫరా నిలిపివేశారు.

చొప్పదండి నియోజకవర్గం
drinking water supply stopped, choppadamdi
author img

By

Published : Apr 8, 2021, 7:04 PM IST

ఫిల్టర్​బెడ్​లో నీరు కలుషితం అవ్వడం వల్ల చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల.... గ్రామాల్లో పాత రక్షిత మంచినీటి బావుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.

మధ్య మానేరు ప్రాజెక్టు, దిగువ మానేరు ప్రాజెక్టుల నుంచి ఫిల్టర్ బెడ్​ల ద్వారా నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల మండలాలకు పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ జలాశయాల్లో నీరు కలుషితమై దుర్గంధం వ్యాపించటంతో ముందు జాగ్రత్తగా నీటి సరఫరా నిలిపివేశారు.

ఫిల్టర్​బెడ్​లో నీరు కలుషితం అవ్వడం వల్ల చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల.... గ్రామాల్లో పాత రక్షిత మంచినీటి బావుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.

మధ్య మానేరు ప్రాజెక్టు, దిగువ మానేరు ప్రాజెక్టుల నుంచి ఫిల్టర్ బెడ్​ల ద్వారా నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల మండలాలకు పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ జలాశయాల్లో నీరు కలుషితమై దుర్గంధం వ్యాపించటంతో ముందు జాగ్రత్తగా నీటి సరఫరా నిలిపివేశారు.

ఇదీ చూడండి: ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్​ సేవలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.