ETV Bharat / state

Koppula on Dalita Bandhu : 'దళితబంధును అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం'

author img

By

Published : Jul 14, 2023, 5:11 PM IST

Koppula Eshwar on Dalita Bandhu : దళితబంధును పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పునరుద్ఘాటించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు జరగడం లేదని చెప్పారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి పథకాన్ని వర్తింపచేస్తామని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.

Koppula Eshwar
Koppula Eshwar

Koppula Eshwar Review on Dalita Bandhu Scheme : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని.. పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితబంధు అమలుపై కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి.. జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే.. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మొదటి దశలో ఎమ్మెల్యేల సూచనతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడంపై అపోహలు రావడంతో.. జిల్లా కలెక్టర్లకే ఆ బాధ్యత అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత జిల్లా మంత్రులు.. జిల్లా కలెక్టర్లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని కొప్పుల ఈశ్వర్ వివరించారు.

Koppula Eshwar on Dalita Bandhu : దళితబంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన.. రూ.1700 కోట్ల రూపాయల నిధుల్లో.. ఇప్పటికే రూ.850 కోట్ల నిధులు మంజూరైనట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేసే లక్ష్యంతో.. ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి.. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

Dalita Bandhu Scheme : హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో.. దళితబంధును ఆ నియోజవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. ఈ క్రమంలోనే అక్కడి 14,400 మంది ఖాతాల్లో.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున.. రూ.500 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేసింది. మరోవైపు అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయానికి రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ బడ్జెట్​ 2023-24లో రూ.17,700 కోట్లను దళితబంధు నిధుల కింద కేటాయించింది. ఈ సంపదను దళితులు పెట్టుబడిగా పెట్టుకొని.. ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.

దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్​ దళితబంధు పథకానికి నాంది పలికారు. ఇందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి.. వారి పురోగతిని చూడాలని సంకల్పించారు. వారు ఈ నగదుతో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టి లాభదాయక వ్యాపారం చేసి.. అందరితో సమానంగా ఉండాలని సీఎం కేసీఆర్​ కోరుకున్నారు. ఈ క్రమంలోనే తొలి విడతలో దళితబంధు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 గ్రామాలను ఎంపిక చేశారు. వారిలో కొంత మందికి దళితబంధును ప్రకటించారు.

ఇవీ చదవండి: Dalit Bandhu in Telangana: 'అణగారిన బతుకుల్లో.. కొత్త కాంతులు నింపుతున్న దళితబంధు'

దళిత బంధు నిధులతో రైస్‌మిల్లు.. ఈ యూనిట్‌ రాష్ట్రానికే ఆదర్శం: కేటీఆర్‌

Koppula Eshwar Review on Dalita Bandhu Scheme : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని.. పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితబంధు అమలుపై కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి.. జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే.. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మొదటి దశలో ఎమ్మెల్యేల సూచనతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడంపై అపోహలు రావడంతో.. జిల్లా కలెక్టర్లకే ఆ బాధ్యత అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత జిల్లా మంత్రులు.. జిల్లా కలెక్టర్లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని కొప్పుల ఈశ్వర్ వివరించారు.

Koppula Eshwar on Dalita Bandhu : దళితబంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన.. రూ.1700 కోట్ల రూపాయల నిధుల్లో.. ఇప్పటికే రూ.850 కోట్ల నిధులు మంజూరైనట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేసే లక్ష్యంతో.. ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి.. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

Dalita Bandhu Scheme : హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో.. దళితబంధును ఆ నియోజవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. ఈ క్రమంలోనే అక్కడి 14,400 మంది ఖాతాల్లో.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున.. రూ.500 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేసింది. మరోవైపు అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయానికి రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ బడ్జెట్​ 2023-24లో రూ.17,700 కోట్లను దళితబంధు నిధుల కింద కేటాయించింది. ఈ సంపదను దళితులు పెట్టుబడిగా పెట్టుకొని.. ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.

దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్​ దళితబంధు పథకానికి నాంది పలికారు. ఇందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి.. వారి పురోగతిని చూడాలని సంకల్పించారు. వారు ఈ నగదుతో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టి లాభదాయక వ్యాపారం చేసి.. అందరితో సమానంగా ఉండాలని సీఎం కేసీఆర్​ కోరుకున్నారు. ఈ క్రమంలోనే తొలి విడతలో దళితబంధు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 గ్రామాలను ఎంపిక చేశారు. వారిలో కొంత మందికి దళితబంధును ప్రకటించారు.

ఇవీ చదవండి: Dalit Bandhu in Telangana: 'అణగారిన బతుకుల్లో.. కొత్త కాంతులు నింపుతున్న దళితబంధు'

దళిత బంధు నిధులతో రైస్‌మిల్లు.. ఈ యూనిట్‌ రాష్ట్రానికే ఆదర్శం: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.