ETV Bharat / state

'లాక్​డౌన్ మరింత కఠినం.. గుంపులుగా బయటకు రావొద్దు'

author img

By

Published : May 22, 2021, 11:15 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో కరీంనగర్​లో వాహనాల తనిఖీలను సీపీ కమలాసన్ రెడ్డి పరిశీలించారు. లాక్​డౌన్​ను మరింత కఠినం చేసినట్లు తెలిపారు. మినహాయింపు వేళల్లో గుంపులుగా బయటకు రావొద్దని సూచించారు.

karimnagar cp visit on lock down, karimnagar lock down
కరీంనగర్​లో లాక్​డౌన్​పై సీపీ వ్యాఖ్యలు, సీపీ పర్యవేక్షణలో లాక్​డౌన్

లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కరీంనగర్ సీపీ కమలాసన్‌ రెడ్డి కోరారు. నగరంలోని గీతాభవన్ కూడలిలో వాహనాల తనిఖీలను శుక్రవారం పర్యవేక్షించారు. సీఎంతో పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాక్‌డౌన్​ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. మినహాయింపు వేళల్లోనూ గుంపులుగా బయటికి రావద్దని కోరారు.

అత్యవసరమైతేనే బయటికు రావాలని సూచించారు. కరోనా రెండో దశ తీవ్రతను గమనించాలని అన్నారు. ఇప్పటికే 875 వాహనాలు సీజ్‌ చేశామని.. 4,600 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. సీజ్‌ చేసిన వాహనాలు లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు పోలీసుల దగ్గరే ఉంటాయని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కరీంనగర్ సీపీ కమలాసన్‌ రెడ్డి కోరారు. నగరంలోని గీతాభవన్ కూడలిలో వాహనాల తనిఖీలను శుక్రవారం పర్యవేక్షించారు. సీఎంతో పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాక్‌డౌన్​ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. మినహాయింపు వేళల్లోనూ గుంపులుగా బయటికి రావద్దని కోరారు.

అత్యవసరమైతేనే బయటికు రావాలని సూచించారు. కరోనా రెండో దశ తీవ్రతను గమనించాలని అన్నారు. ఇప్పటికే 875 వాహనాలు సీజ్‌ చేశామని.. 4,600 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. సీజ్‌ చేసిన వాహనాలు లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు పోలీసుల దగ్గరే ఉంటాయని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.