పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందర్నీ భాగస్వామ్యులు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించాలని అధికారులకు సూచించారు.
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టి పూర్తి చేసిన పనులన్నీని రెండో విడతలో ప్రజలకు తెలపాలని సూచించారు.
ప్రతి రోజు కార్యక్రమాలను రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ఉపయోగంలో లేని బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్ను పూడ్చివేయించాలని సూచించారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో.. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులందరు పోటీపడుతూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.