ETV Bharat / state

Gellu srinivas: 'నన్ను గెలిపిస్తే మీ పనిమనిషిలా సేవ చేసుకుంటా'

author img

By

Published : Aug 11, 2021, 2:50 PM IST

Updated : Aug 11, 2021, 3:12 PM IST

పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి.. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​కు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్​(Gellu srinivas yadav)​ కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపించే బాధ్యతను కేసీఆర్.. మంత్రి హరీశ్​రావుకు అప్పగించినట్లు చెప్పారు.​ కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంటలో నిర్వహించిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.

Gellu srinivas
గెల్లు శ్రీనివాస్

కరీంనగర్ జిల్లా​ హుజూరాబాద్​ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటానని తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​(Gellu srinivas) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్​కు పాదాభివందనాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సభలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

నన్ను గెలిపిస్తే మీ పనిమనిషిలా సేవ చేసుకుంటా: గెల్లు శ్రీనివాస్​

పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు.. హుజూరాబాద్​ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు. చదువుకునే రోజుల నుంచి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను. కేసీఆర్​ నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను. ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటాను. -గెల్లు శ్రీనివాస్​, హుజూరాబాద్​ తెరాస అభ్యర్థి.

పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కేసీఆర్​ అవకాశం కల్పించారని శ్రీనివాస్​ అన్నారు. విద్యార్థి నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. దళిత, బహుజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Huzurabad: ఎవరీ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... కేసీఆర్ ఆయన్నే ఎందుకు ప్రకటించారు?

కరీంనగర్ జిల్లా​ హుజూరాబాద్​ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటానని తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​(Gellu srinivas) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్​కు పాదాభివందనాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో తెరాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సభలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.

నన్ను గెలిపిస్తే మీ పనిమనిషిలా సేవ చేసుకుంటా: గెల్లు శ్రీనివాస్​

పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు.. హుజూరాబాద్​ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు. చదువుకునే రోజుల నుంచి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను. కేసీఆర్​ నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను. ప్రజలకు పనిమనిషిలా సేవ చేసుకుంటాను. -గెల్లు శ్రీనివాస్​, హుజూరాబాద్​ తెరాస అభ్యర్థి.

పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కేసీఆర్​ అవకాశం కల్పించారని శ్రీనివాస్​ అన్నారు. విద్యార్థి నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. దళిత, బహుజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Huzurabad: ఎవరీ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... కేసీఆర్ ఆయన్నే ఎందుకు ప్రకటించారు?

Last Updated : Aug 11, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.