రాష్ట్రంలో ఓ వైపు కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంటే.. మరోవైపు చికిత్సలో వాడే ఇంజక్షన్లలో కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న విషయం సంచలనం రేపుతోంది. రెమ్డెసివిర్ను బ్లాక్లో అధిక ధరకు అమ్ముతూ ప్రజల సొమ్ము కాజేస్తోన్న ఓ ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 18 ఇంజెక్షన్లతో పాటు రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు
జిల్లాకు చెందిన దాసరి సురేశ్, సత్యనారాయణ, వెంకటసాయి, వరంగల్కు చెందిన నరేశ్లు.. ఓ ముఠాగా ఏర్పడి రెమ్డెసివిర్ ఇంజక్షన్ను రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. కృత్రిమ కొరత సృష్టించి, దందా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కమల్హాసన్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి ఈటల