ETV Bharat / state

విద్యుత్​ ఉద్యోగుల నిరసన - కరీంనగర్​ జిల్లా వార్తలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 2020 విద్యుత్​ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కరీంనగర్​లోని ఎస్​ఈ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పవర్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఆధ్వర్వంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ.. నినాదాలు చేశారు.

Electricity Employs Protest On Central Government
విద్యుత్​ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Jun 1, 2020, 8:04 PM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్​ఈ కార్యాలయంలో విద్యుత్​ ఉద్యోగులు పవర్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 2020 విద్యుత్​ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. విద్యుత్​ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుందని జేఏసీ నాయకులు మండిపడ్డారు.

విద్యుత్​ సంస్థలను ప్రైవేట్​ పరం చేయడం కోసమే ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశ్యమని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. పేదలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యుత్​ ఉద్యోగులే కాకుండా.. ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యుత్​ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్​ఈ కార్యాలయంలో విద్యుత్​ ఉద్యోగులు పవర్​ ఎంప్లాయిస్​ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 2020 విద్యుత్​ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. విద్యుత్​ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుందని జేఏసీ నాయకులు మండిపడ్డారు.

విద్యుత్​ సంస్థలను ప్రైవేట్​ పరం చేయడం కోసమే ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశ్యమని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. పేదలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యుత్​ ఉద్యోగులే కాకుండా.. ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యుత్​ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.