ETV Bharat / state

ఆ ఊళ్లో అన్నీ ఉన్నా మామూళ్లు మస్ట్‌.. లేదంటే ఇల్లు ఫట్‌..

author img

By

Published : Oct 16, 2022, 4:46 PM IST

అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించినా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా.. అధికారులు వాటిని కూల్చి వేస్తుంటారు. కరీంనగర్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. అనుమతులు పొందినా.. తాము అడిగిన మామూళ్లు ఇవ్వకుంటే ఇళ్లను కూలగొట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ఇలాంటి ఘటనలపై తొలుత పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. ఆ తర్వాత పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ ఊళ్లో అన్నీ ఉన్నా మామూళ్లు మస్ట్‌.. లేదంటే ఇల్లు ఫట్‌..
ఆ ఊళ్లో అన్నీ ఉన్నా మామూళ్లు మస్ట్‌.. లేదంటే ఇల్లు ఫట్‌..
ఆ ఊళ్లో అన్నీ ఉన్నా మామూళ్లు మస్ట్‌.. లేదంటే ఇల్లు ఫట్‌..

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని సీతారాంపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కూల్చివేశాడంటూ పోలీస్‌ కేసు నమోదవటం చర్చనీయాంశంగా మారింది. సీతారాంపూర్ పరిధిలో కొట్టె సంతోశ్‌.. ముగ్గురు సోదరులకు సంబంధించి 3 ఇళ్ల కోసం నగరపాలక సంస్థ అనుమతి తీసుకొని నిర్మాణం చేస్తున్నాడు. అయినా రాత్రికి రాత్రి జేసీబీలతో ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ గ్రామం నగరపాలక సంస్థలో విలీనం కాకముందు పంచాయతీగా ఉండగా.. అప్పట్లో సర్పంచ్‌ తీరుతో అనుమతి రాలేదు. నగరపాలికలో విలీనం తర్వాత అనుమతులు పొందినా.. అప్పటి సర్పంచ్‌, ప్రస్తుత కార్పొరేటర్‌కు మింగుడుపడటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న ఇంటిని అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

1992లో మేము ఈ భూమిని కొన్నాం. 2014లో ఇళ్లు కట్టుకుందామని అప్పటి సర్పంచ్‌ వద్దకు పర్మిషన్‌ కోసం వెళితే రూ.10 లక్షలని డిమాండ్‌ చేశాడు. తర్వాత మా ఊరు మున్సిపాలిటీలో కలిశాక అన్ని అనుమతులు తెచ్చుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించాం. స్లాబ్‌ వేద్దామనుకున్న సమయంలో రాత్రికి రాత్రి జేసీబీలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. మేము ఇళ్లు కట్టుకోవడం ప్రస్తుత కార్పొరేటర్‌కు, మాజీ సర్పంచ్‌కు ఇష్టం లేదు. - సంతోశ్‌, బాధితుడు

కక్షతో తమకు ఆస్తి నష్టం కలిగిస్తున్నారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలంపై తొలి నుంచి కన్నేసిన కార్పొరేటర్‌.. డబ్బులు ఇవ్వకపోవటంతో కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారటంతో సీపీ సత్యనారాయణ స్వయంగా కూల్చివేసిన నిర్మాణాన్ని పరిశీలించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేయటంతో రూ.40 లక్షల వరకు నష్టం జరిగిందని.. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి..

ఆ 'డబుల్‌' ఇళ్లు ఎవరికిచ్చినట్టబ్బా.. పాలమూరులో ఇప్పుడిదే హాట్‌టాపిక్..

'50 పెట్రోల్​ బాంబులు పేల్చి వారిని చంపేయాలి!'.. ఆడియో లీక్​ కేసులో కార్పొరేటర్​ అరెస్ట్​

ఆ ఊళ్లో అన్నీ ఉన్నా మామూళ్లు మస్ట్‌.. లేదంటే ఇల్లు ఫట్‌..

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని సీతారాంపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కూల్చివేశాడంటూ పోలీస్‌ కేసు నమోదవటం చర్చనీయాంశంగా మారింది. సీతారాంపూర్ పరిధిలో కొట్టె సంతోశ్‌.. ముగ్గురు సోదరులకు సంబంధించి 3 ఇళ్ల కోసం నగరపాలక సంస్థ అనుమతి తీసుకొని నిర్మాణం చేస్తున్నాడు. అయినా రాత్రికి రాత్రి జేసీబీలతో ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ గ్రామం నగరపాలక సంస్థలో విలీనం కాకముందు పంచాయతీగా ఉండగా.. అప్పట్లో సర్పంచ్‌ తీరుతో అనుమతి రాలేదు. నగరపాలికలో విలీనం తర్వాత అనుమతులు పొందినా.. అప్పటి సర్పంచ్‌, ప్రస్తుత కార్పొరేటర్‌కు మింగుడుపడటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న ఇంటిని అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

1992లో మేము ఈ భూమిని కొన్నాం. 2014లో ఇళ్లు కట్టుకుందామని అప్పటి సర్పంచ్‌ వద్దకు పర్మిషన్‌ కోసం వెళితే రూ.10 లక్షలని డిమాండ్‌ చేశాడు. తర్వాత మా ఊరు మున్సిపాలిటీలో కలిశాక అన్ని అనుమతులు తెచ్చుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించాం. స్లాబ్‌ వేద్దామనుకున్న సమయంలో రాత్రికి రాత్రి జేసీబీలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. మేము ఇళ్లు కట్టుకోవడం ప్రస్తుత కార్పొరేటర్‌కు, మాజీ సర్పంచ్‌కు ఇష్టం లేదు. - సంతోశ్‌, బాధితుడు

కక్షతో తమకు ఆస్తి నష్టం కలిగిస్తున్నారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలంపై తొలి నుంచి కన్నేసిన కార్పొరేటర్‌.. డబ్బులు ఇవ్వకపోవటంతో కావాలనే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారటంతో సీపీ సత్యనారాయణ స్వయంగా కూల్చివేసిన నిర్మాణాన్ని పరిశీలించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేయటంతో రూ.40 లక్షల వరకు నష్టం జరిగిందని.. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి..

ఆ 'డబుల్‌' ఇళ్లు ఎవరికిచ్చినట్టబ్బా.. పాలమూరులో ఇప్పుడిదే హాట్‌టాపిక్..

'50 పెట్రోల్​ బాంబులు పేల్చి వారిని చంపేయాలి!'.. ఆడియో లీక్​ కేసులో కార్పొరేటర్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.