కేసీఆర్ను విమర్శిస్తున్న జీవన్రెడ్డి తెలంగాణలో 83 శాతం మంది విద్యావంతులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన జీవన్రెడ్డి... తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని విమర్శించారు. తన గెలుపుతో కాంగ్రెస్ విజయం మొదలైందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చూడండి :కాంగ్రెస్ విజయం జీవన్రెడ్డితో ప్రారంభం: పొన్నం