ETV Bharat / state

ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆందోళన.. 'సంస్థ నష్టపోయే ప్రమాదముంది'

author img

By

Published : Mar 19, 2021, 12:31 PM IST

కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్​కు అప్పగించడాన్ని నిరసిస్తూ ఎల్​ఐసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. విదేశీ పెట్టుబడులను అనుమతించవద్దని డిమాండ్‌ చేస్తూ ఒక రోజు సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Concern of LIC employees At the Karimnagar Division Office
ఎల్‌ఐసీ ఉద్యోగుల ఆందోళన.. 'సంస్థ నష్టపోయే ప్రమాదముంది'

ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విధులు బహిష్కరించి.. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

నూతన ప్రతిపాదనల వల్ల.. ఎల్‌ఐసీ సంస్థ నష్టపోయే ప్రమాదముందంటూ ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విధులు బహిష్కరించి.. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

నూతన ప్రతిపాదనల వల్ల.. ఎల్‌ఐసీ సంస్థ నష్టపోయే ప్రమాదముందంటూ ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం.. వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: గెలవాలంటే ఎవరికెన్ని ఓట్లు కావాలో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.