ETV Bharat / state

'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలి'

కరీంనగర్​ కలెక్టరేట్​ సమావేశ మందిరంలో పాలనాధికారి కె.శశాంక సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్​వో డాక్టర్ సుజాత, సూపరింటెండెంట్ రత్నమాల, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు.

author img

By

Published : Jul 27, 2020, 10:57 PM IST

collector shashanka review with officials
'ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలి'

ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎంహెచ్​వో డాక్టర్ సుజాత, సూపరింటెండెంట్ రత్నమాల, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 100 పడకలు ఉన్నాయని.. మరిన్ని ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బందిని పెంచి, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బాధితుల్లో తీవ్రమైన లక్షణాలు ఉన్న వారికి అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. హోం ఐసోలేషన్​కు పంపించే రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. 14 రోజులు ఇంట్లోనే ఉండేలా చూడాలన్నారు. వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఎప్పటికప్పుడు శానిటేషన్ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎంహెచ్​వో డాక్టర్ సుజాత, సూపరింటెండెంట్ రత్నమాల, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 100 పడకలు ఉన్నాయని.. మరిన్ని ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బందిని పెంచి, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బాధితుల్లో తీవ్రమైన లక్షణాలు ఉన్న వారికి అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. హోం ఐసోలేషన్​కు పంపించే రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. 14 రోజులు ఇంట్లోనే ఉండేలా చూడాలన్నారు. వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఎప్పటికప్పుడు శానిటేషన్ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.