ETV Bharat / state

'విద్యుత్​ బిల్లుల బలవంతపు వసూళ్లు సరికాదు' - Karimnagar Current Office BJP Protest

లాక్​డౌన్​ కాలం నాటి 3 నెలల విద్యుత్​ బిల్లులను బలవంతంగా వసూలు చేయడం సరికాదని భాజపా కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు అన్నారు. అధిక విద్యుత్​ బిల్లులను నిరసిస్తూ నగరంలోని విద్యుత్​ ఎస్​ఈ కార్యాలయం ఎదుట భాజపా నేతలు ధర్నా నిర్వహించారు.

BJP Protest
కరీంనగర్​లో భాజపా ధర్నా
author img

By

Published : Jun 15, 2020, 10:35 PM IST

కరోనా ఆపత్కాలంలో ప్రజలపై అధిక విద్యుత్​ బిల్లులు భారం వేయడం ప్రభుత్వ వైఫల్యమని భాజపా కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణ రావు ఆరోపించారు. ప్రభుత్వం విధించిన అధిక విద్యుత్​ బిల్లులను నిరసిస్తూ నగరంలోని ఎస్​ఈ కార్యాలయం ఎదుట భాజపా నేతలు అందోళన చేశారు.

పేదలపై అధిక బిల్లుల భారం వేయకుండా వాటిని మాఫీ చేయాలని... ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని సత్యనారాయణ డిమాండ్​ చేశారు. విద్యుత్‌ బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని... ఇదేమని ప్రశ్నిస్తే... అరెస్టు చేసి.. కేసులు పెడతారా అని మండిపడ్డారు. వెంటనే విద్యుత్​ బిల్లులు రద్దు చేయకపోతే... భారీ ఉద్యమాన్ని చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్​ సమీక్ష

కరోనా ఆపత్కాలంలో ప్రజలపై అధిక విద్యుత్​ బిల్లులు భారం వేయడం ప్రభుత్వ వైఫల్యమని భాజపా కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు భాష సత్యనారాయణ రావు ఆరోపించారు. ప్రభుత్వం విధించిన అధిక విద్యుత్​ బిల్లులను నిరసిస్తూ నగరంలోని ఎస్​ఈ కార్యాలయం ఎదుట భాజపా నేతలు అందోళన చేశారు.

పేదలపై అధిక బిల్లుల భారం వేయకుండా వాటిని మాఫీ చేయాలని... ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని సత్యనారాయణ డిమాండ్​ చేశారు. విద్యుత్‌ బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని... ఇదేమని ప్రశ్నిస్తే... అరెస్టు చేసి.. కేసులు పెడతారా అని మండిపడ్డారు. వెంటనే విద్యుత్​ బిల్లులు రద్దు చేయకపోతే... భారీ ఉద్యమాన్ని చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.