ETV Bharat / state

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బ్యాంక్ ఉద్యోగులు

author img

By

Published : Mar 15, 2021, 6:51 PM IST

బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్రం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

bank-employees-protest-against-bank-privatization-by-central-government-in-karimnagar
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బ్యాంక్ ఉద్యోగులు

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కరీంనగర్‌లోని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ కరీంనగర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకులన్నింటినీ మూసేసి యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా చేపట్టారు.

కేంద్రప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్ బ్యాంక్‌ యూనియన్స్ పిలుపుతో నిరసన చేపట్టారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కరీంనగర్‌లోని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ కరీంనగర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకులన్నింటినీ మూసేసి యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా చేపట్టారు.

కేంద్రప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్ బ్యాంక్‌ యూనియన్స్ పిలుపుతో నిరసన చేపట్టారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: మజ్లిస్‌ కనుసన్నల్లో పోలీస్​ వ్యవస్థ నడుస్తోంది: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.