ETV Bharat / state

ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదు

author img

By

Published : Aug 29, 2020, 3:29 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కరోనాతో ఓ మహిళ మృతి చెందింది. చెస్ట్​ క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి మరణించింది. మున్సిపల్​ సిబ్బంది వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

woman dead in yellareddy news
ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. ఓ రేషన్​ డీలర్ సతీమణి కొవిడ్​ వ్యాధితో శనివారం మృతి చెందింది. ఆమెకు చెస్ట్​ క్యాన్సర్​ ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు శుక్రవారం కరోనా నిర్ధరణ పరీక్ష చేయించగా పాజిటివ్​ అని తెలిసింది.

అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న ఆమె శనివారం తెల్లవారుజామున శ్వాసతో ఇబ్బంది పడి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది .. మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. ఓ రేషన్​ డీలర్ సతీమణి కొవిడ్​ వ్యాధితో శనివారం మృతి చెందింది. ఆమెకు చెస్ట్​ క్యాన్సర్​ ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు శుక్రవారం కరోనా నిర్ధరణ పరీక్ష చేయించగా పాజిటివ్​ అని తెలిసింది.

అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న ఆమె శనివారం తెల్లవారుజామున శ్వాసతో ఇబ్బంది పడి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది .. మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.