ETV Bharat / state

బాన్సువాడలో పర్యటించిన సభాపతి పోచారం శ్రీనివాస్ - శాసన సభ స్పీకర్​ తాజా వార్తలు

రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

speaker pocharam srinivas visit banswada
బాన్సువాడలో పర్యటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్
author img

By

Published : Jun 14, 2021, 10:43 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను సభాపతి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను తీసుకుని స్వయంగా ఎలక్ట్రిక్ బగ్గీ కార్ నడుపుతూ పట్టణంలో కలియతిరిగారు.

ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే మున్సిపల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం సేకరించిన స్థలాన్ని సభాపతి పరిశీలించారు. అనంతరం బాన్సువాడ నూతన డీఆర్​ఓ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను సభాపతి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను తీసుకుని స్వయంగా ఎలక్ట్రిక్ బగ్గీ కార్ నడుపుతూ పట్టణంలో కలియతిరిగారు.

ఈ పర్యటనలో భాగంగా బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే మున్సిపల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం సేకరించిన స్థలాన్ని సభాపతి పరిశీలించారు. అనంతరం బాన్సువాడ నూతన డీఆర్​ఓ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు.

ఇదీ చదవండి: పోడు భూములపై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం.. లాక్కొవద్దని గిరిజనుల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.