కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో రోటా వైరస్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. చిన్నారులందరికి టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యం కోసం వచ్చే రోగికి నవ్వుతూ చికిత్స అందించాలని సూచించారు. బాన్సువాడ ఆస్పత్రికి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నల్లమల యురేనియం తవ్వకాలపై నాన్నతో మాట్లాడతా...!