ETV Bharat / state

మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో 20 మందికి నియామక పత్రాలు - స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి వార్తలు

బాన్సువాడ పట్టణంలో మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో నూతనంగా 20 మంది ఉద్యోగులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి నియామక పత్రాలను అందించారు. రాష్ట్రంలో మంజూరైన 7 మాతాశిశు సంక్షేమ ఆసుపత్రుల్లో మొట్టమొదటగా పూర్తి చేసుకున్న ఆసుపత్రి ఇదేనని స్పీకర్​ స్పష్టం చేశారు.

Recruitment papers for 20 people in Mother and Child Welfare Hospital  by speaker pocharam srinivasa reddy at bansuwada
మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో 20 మందికి నియామక పత్రాలు
author img

By

Published : Jan 23, 2021, 3:42 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో నూతనంగా 20 మందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో 7 మాతాశిశు సంక్షేమ ఆసుపత్రులు మంజూరు చేయగా.. అందులో మొట్టమొదటిగా పూర్తి చేసుకున్న ఆసుపత్రి ఇదేనని స్పీకర్ అన్నారు. పరికరాలు వచ్చాక అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

Recruitment papers for 20 people in Mother and Child Welfare Hospital  by speaker pocharam srinivasa reddy at bansuwada
మాతాశిశు సంక్షేమ ఆసుపత్రుల్లో మొట్టమొదటగా పూర్తి చేసుకున్న ఆసుపత్రి

ఆపరేషన్, లేబోరేటరీ రూమ్ పరికరాలు కొన్ని కావలసిఉందన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. బాన్సువాడ రహదారుల అభివృద్ధికి 300 కోట్లు కేటాయించారని.. తద్వారా రాకపోకలు పెరిగాయన్నారు. ఆసుపత్రికి వచ్చేవారికి మంచి వైద్యం అందించి.. క్షేమంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాల వల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.

ఇదీ చూడండి: పోడు రైతుల బతుకును బజారుకీడ్చొద్దు : కోదండరాం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిలో నూతనంగా 20 మందికి స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో 7 మాతాశిశు సంక్షేమ ఆసుపత్రులు మంజూరు చేయగా.. అందులో మొట్టమొదటిగా పూర్తి చేసుకున్న ఆసుపత్రి ఇదేనని స్పీకర్ అన్నారు. పరికరాలు వచ్చాక అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

Recruitment papers for 20 people in Mother and Child Welfare Hospital  by speaker pocharam srinivasa reddy at bansuwada
మాతాశిశు సంక్షేమ ఆసుపత్రుల్లో మొట్టమొదటగా పూర్తి చేసుకున్న ఆసుపత్రి

ఆపరేషన్, లేబోరేటరీ రూమ్ పరికరాలు కొన్ని కావలసిఉందన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. బాన్సువాడ రహదారుల అభివృద్ధికి 300 కోట్లు కేటాయించారని.. తద్వారా రాకపోకలు పెరిగాయన్నారు. ఆసుపత్రికి వచ్చేవారికి మంచి వైద్యం అందించి.. క్షేమంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాల వల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.

ఇదీ చూడండి: పోడు రైతుల బతుకును బజారుకీడ్చొద్దు : కోదండరాం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.