ETV Bharat / state

'పీఆర్సీ రూపకల్పనలో పారదర్శకత లేదు '

author img

By

Published : Jan 28, 2021, 6:01 PM IST

మూడేళ్ల నుంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నా ఇంత తక్కువ పీఆర్సీ ప్రకటించడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేసిందని కామారెడ్డి జిల్లా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్​ అన్నారు. పీఆర్సీ నివేదిక అసంబద్ధంగా రూపొందించారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాన్సువాడ తహసీల్దార్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

prtu andolana on prc in kamareddy district banswada tahsildar office
'పీఆర్సీ నివేదిక రూపకల్పనలో పారదర్శకత లేదు '

పీఆర్సీ నివేదిక రూపకల్పనలో ఎలాంటి ప్రామాణాలు పాటించలేదని కామారెడ్డి జిల్లా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్​ ఆరోపించారు. మూడేళ్లుగా పెండింగ్​లో ఉంచి ఇంత దారుణంగా పీఆర్సీ ప్రకటిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీ ప్రకటనను వ్యతిరేకిస్తూ బాన్సువాడ తహసీల్దార్​ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ రూపొందించాల్సిన పీఆర్సీ నివేదిక పారదర్శకంగా లేదన్నారు.

చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పీఆర్సీ నివేదికను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ గంగాధర్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్వ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మంద ప్రవీణ్ కుమార్, రాష్ట్ర బాధ్యులు వెంకట్​ గౌడ్, రాంచందర్, రామకృష్ణ, సంతోశ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బాధ్యులు పురుషోత్తం, మండల కార్యవర్గ సభ్యులు దాసరి రవీందర్, హరీశ్​ మేడం, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'పీఆర్సీపై ఐక్యవేదిక నేతలను చర్చలకు పిలవాలి'

పీఆర్సీ నివేదిక రూపకల్పనలో ఎలాంటి ప్రామాణాలు పాటించలేదని కామారెడ్డి జిల్లా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్​ ఆరోపించారు. మూడేళ్లుగా పెండింగ్​లో ఉంచి ఇంత దారుణంగా పీఆర్సీ ప్రకటిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీ ప్రకటనను వ్యతిరేకిస్తూ బాన్సువాడ తహసీల్దార్​ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ రూపొందించాల్సిన పీఆర్సీ నివేదిక పారదర్శకంగా లేదన్నారు.

చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్​ చేశారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పీఆర్సీ నివేదికను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ గంగాధర్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నర్వ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మంద ప్రవీణ్ కుమార్, రాష్ట్ర బాధ్యులు వెంకట్​ గౌడ్, రాంచందర్, రామకృష్ణ, సంతోశ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బాధ్యులు పురుషోత్తం, మండల కార్యవర్గ సభ్యులు దాసరి రవీందర్, హరీశ్​ మేడం, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'పీఆర్సీపై ఐక్యవేదిక నేతలను చర్చలకు పిలవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.