కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కొండని పద్మ, ప్రసాద్ దంపతులకు ఇటీవల బాబు జన్మించాడు. కుటుంబ పోషణ భారం కావడం వల్ల గుట్టు చప్పుడు కాకుండా.. బాబును మోర్తాడ్కు చెందిన పుల్లపు కవిత అనే మహిళకు రూ.15వేలకు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ మహిళకు బాబును అప్పజెప్పారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. బాబును శిశు గృహానికి తరలించారు.
- ఇదీ చదవండి : కాలుష్య కాసారంగా దిల్లీ- మోగుతున్న ప్రమాద ఘంటికలు