కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. బిచ్కుంద ఆసుపత్రితో మద్నూర్, జుక్కల్ మండలాల ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శోభ, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్రెడ్డి