ETV Bharat / state

'కాట్ ​పా చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలి'

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ కార్మిక సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో 10 సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్రం.. బీడీ పరిశ్రమను తొలగించే యత్నం చేస్తోందని, దీనిపై ఆధారపడి ఉన్న వాళ్లను రోడ్డున పడేయాలని చూస్తోందని ఆరోపించారు.

author img

By

Published : Mar 9, 2021, 1:14 PM IST

beedi labours dharna in kamareddy
కామారెడ్డిలో బీడీ కార్మికుల ధర్నా

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీడీ కార్మిక సమాఖ్య పిలుపు మేరకు.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో జిల్లాలోని 10 సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను తొలగించే ప్రయత్నం చేస్తోందని నాయకులు ఆరోపించారు. అందులో భాగంగానే 12 చట్టాలను తీసుకువచ్చి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తోందని మండిపడ్డారు. కాట్ పా చట్టం ద్వారా పరిశ్రమ కుంటుపడుతోందని, ఆ చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు లబ్ధి చేకూరేలా పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీడీ కార్మిక సమాఖ్య పిలుపు మేరకు.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో జిల్లాలోని 10 సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను తొలగించే ప్రయత్నం చేస్తోందని నాయకులు ఆరోపించారు. అందులో భాగంగానే 12 చట్టాలను తీసుకువచ్చి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తోందని మండిపడ్డారు. కాట్ పా చట్టం ద్వారా పరిశ్రమ కుంటుపడుతోందని, ఆ చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు లబ్ధి చేకూరేలా పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.