కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన ఆటోడ్రైవర్లు తమకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్ కృష్ణా నాయక్కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కారణంగా పనిలేక పస్తులుంటున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజులుగా ఆటోలు నడవక కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా మారిందని వారు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు.
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్