ETV Bharat / state

కదం తొక్కిన కర్షకులు ... కామారెడ్డిలో రైతుల ఆందోళన

author img

By

Published : Oct 23, 2020, 5:34 AM IST

శ్వేదం చిందించి సేధ్యం చేసే రైతన్న... కాడి వదిలి నిరసన బాట పట్టాడు. పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని గొంతెత్తి ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొక్కజొన్న రైతులు రాస్తారోకే చేసారు. సుమారు ఐదు గంటల పాటు రహదారిని దిగ్బంధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సంఘటితమైన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. 44వ జాతీయ రహదారిపై నిరసన చేసి.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులకు, రైతులకు తోపులాటలో ఇద్దరు గాయపడ్డారు. అధికారుల హామీతో రైతులు శాంతించారు.

మక్క పంట మద్దతు ధర కోసం... పోరు బాట పట్టిన కామారెడ్డి రైతులు
మక్క పంట మద్దతు ధర కోసం... పోరు బాట పట్టిన కామారెడ్డి రైతులు

కామారెడ్డి జిల్లా అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ నిరసన తెలిపారు. పట్టణ శివారులోని టెక్రియాల్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 44వ జాతీయ రహదారిని దిగ్బంధించి బైఠాయించారు. మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1860లకు క్వింటా చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్రాప్ హాలిడే ప్రకటనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. రైతులందరూ వాట్సప్ సందేశాల ద్వారా సంఘటితమై ఆందోళనకు తరలి వచ్చారు.

ఉదయం 11.30 సమయంలో రైతులంతా టెక్రియాల్ చౌరస్తాలో బైఠాయించారు. సుమారు 2.30 వరకు 44వ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు పలు మార్లు చెప్పినా... పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. అనంతరం కలెక్టరేట్​ ముట్టడికి బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి ఇంఛార్జి ఆర్డీవో వచ్చి రైతుల నుంచి మెమోరాండం స్వీకరించారు. రైతుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు శాంతించారు. పది రోజుల్లోపు సీఎం కేసీఆర్ స్పందించి మక్కలను కొనుగోలు చేయాలని.. లేదంటే ఈనెల 30న ప్రగతి భవన్ ముట్టడిస్తాంటూ రైతులు హెచ్చరించారు.

జాతీయ రహదారిపై రైతుల ఆందోళనతో చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్​ను మళ్లించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన సమయంలోనూ రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి.

ఇదీ చూడండి: వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

కామారెడ్డి జిల్లా అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ నిరసన తెలిపారు. పట్టణ శివారులోని టెక్రియాల్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులందరూ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 44వ జాతీయ రహదారిని దిగ్బంధించి బైఠాయించారు. మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1860లకు క్వింటా చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్రాప్ హాలిడే ప్రకటనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. రైతులందరూ వాట్సప్ సందేశాల ద్వారా సంఘటితమై ఆందోళనకు తరలి వచ్చారు.

ఉదయం 11.30 సమయంలో రైతులంతా టెక్రియాల్ చౌరస్తాలో బైఠాయించారు. సుమారు 2.30 వరకు 44వ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు పలు మార్లు చెప్పినా... పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. అనంతరం కలెక్టరేట్​ ముట్టడికి బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి ఇంఛార్జి ఆర్డీవో వచ్చి రైతుల నుంచి మెమోరాండం స్వీకరించారు. రైతుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు శాంతించారు. పది రోజుల్లోపు సీఎం కేసీఆర్ స్పందించి మక్కలను కొనుగోలు చేయాలని.. లేదంటే ఈనెల 30న ప్రగతి భవన్ ముట్టడిస్తాంటూ రైతులు హెచ్చరించారు.

జాతీయ రహదారిపై రైతుల ఆందోళనతో చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్​ను మళ్లించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన సమయంలోనూ రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి.

ఇదీ చూడండి: వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.