కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గున్కూల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ ఈ ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గ్రామ సర్పంచ్ భర్తను అరెస్టు చేశారు.
ఈ అరెస్టుకు నిరసనగా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తెరాసకు చెందిన ఓ జిల్లా ప్రజాప్రతినిధి చెప్పే మాటలు విని.. సర్పంచ్ భర్తను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి