కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ ఛైర్మన్ శైలజ పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాలంకరణతో నృత్యాలు చేస్తూ అలరించారు. బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, దీనిని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్ తెలిపారు.
ఇదీ చూడండి : వరదల్లో చిక్కుకున్న మోదీ- కాపాడిన ఎన్డీఆర్ఎఫ్