జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి ఠాణాకు పోలీసులు బేడీలు వేశారు. నిజమేనండి.... ఖైదీలకు వేయాల్సిన బేడీలను పోలీస్స్టేషన్ గేటుకు తాళంగా ఉపయోగించారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా... గణేశ్ నిమజ్జనం సందర్భంగా సిబ్బంది అందరు బందోబస్తుకు వెళ్లారని తెలిపారు. ఠాణాలో ఒకే కానిస్టేబుల్ ఉండటం వల్ల స్టేషన్ ఆవరణలో వాహనాలు, విలువైన వస్తువులు ఉన్నందును ఈ విధంగా వేశామని వివరించారు. ఇలా మరోసారి జరగకుండా చూస్తానని ఎస్సై తెలిపారు.
ఉండవల్లి పోలీస్స్టేషన్కు బేడీలు... ఎందుకంటే... - gadwal news
ఖైదీలకు వేయాల్సిన బేడీలను పోలీస్స్టేషన్ గేటుకు వేశారు ఆ ఊరి పోలీసులు. అంటే ఠాణా ఏదైనా నేరం చేసిందని కాదండోయ్... సిబ్బంది ఎవరూ లేకపోవటం వల్ల తాళాలకు బదులు బేడీలను ఉపయోగించారట అంతే. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో చోటుచేసుకుంది.

undavalli police station gate lock with cup links
జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి ఠాణాకు పోలీసులు బేడీలు వేశారు. నిజమేనండి.... ఖైదీలకు వేయాల్సిన బేడీలను పోలీస్స్టేషన్ గేటుకు తాళంగా ఉపయోగించారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా... గణేశ్ నిమజ్జనం సందర్భంగా సిబ్బంది అందరు బందోబస్తుకు వెళ్లారని తెలిపారు. ఠాణాలో ఒకే కానిస్టేబుల్ ఉండటం వల్ల స్టేషన్ ఆవరణలో వాహనాలు, విలువైన వస్తువులు ఉన్నందును ఈ విధంగా వేశామని వివరించారు. ఇలా మరోసారి జరగకుండా చూస్తానని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు