ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలు: కార్తిక దీపాలతో వెలుగులీనుతున్న నదీమతల్లి

author img

By

Published : Nov 22, 2020, 9:14 AM IST

కార్తిక దీపాలతో తుంగభద్రా నది పులకించిపోతోంది. అప్పుడప్పడే తొలగుతున్న చీకట్లలో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలతో నదీమతల్లి వెలుగులీనుతోంది. తుంగభద్ర పుష్కరాల్లో మూడోరోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.

thunabhadra pushkaralu at alampur in jogulamba gadwal district
కార్తిక దీపాలతో వెలుగులీనుతున్న నదీమతల్లి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తుంగభద్ర పుష్కరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో తరలివస్తున్న భక్తులు.. తుంగభద్రా నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఘాట్లోనే సంకల్పం చేసుకుని పూర్వీకులకు పిండప్రదానాలు చేస్తున్నారు. అనంతరం అమ్మవారి సమేత స్వామిని దర్శించుకుంటున్నారు. ఆదివారం కావడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువయింది.

  • ఇదీ చూడండి : శోభాయమానం.. పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తుంగభద్ర పుష్కరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో తరలివస్తున్న భక్తులు.. తుంగభద్రా నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఘాట్లోనే సంకల్పం చేసుకుని పూర్వీకులకు పిండప్రదానాలు చేస్తున్నారు. అనంతరం అమ్మవారి సమేత స్వామిని దర్శించుకుంటున్నారు. ఆదివారం కావడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువయింది.

  • ఇదీ చూడండి : శోభాయమానం.. పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.