విజయదశమి పర్వదినాన ఆది దంపతులైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించిన హంస వాహనంలో సతీసమేతంగా కొలువుదీరిన స్వామివారు తుంగభద్ర నదిలో విహరించారు. ఈ వేడుకను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెప్పోత్సవ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్ పర్సన్లు... అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి: రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు