ETV Bharat / state

గద్వాల జిల్లాలో సీఎస్​, డీజీపీ పర్యటన.. అధికారులతో సమీక్ష

author img

By

Published : Apr 23, 2020, 8:45 AM IST

ముఖ్యమంత్రి ఆదేశాలతో జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎస్​ సోమేశ్​కుమార్​, డీజీపీ మహేందర్​రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంత కుమారితో కలిసి పర్యటించారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.

state higher officials visit to gadwal to inspect corona  effect
గద్వాల జిల్లాలో సీఎస్​, డీజీపీ పర్యటన.. అధికారులతో సమీక్ష

జోగులాంబ గద్వాల జిల్లాలో కాంటాక్ట్​ ట్రేసింగ్​ ప్రక్రియ మరింత ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకుమారితో కలిసి ఆయన బుధవారం గద్వాలలోని కంటైన్మెంట్​ ప్రాంతాలైన వేదనగర్, మొమిన్ మోహల్లాలో పర్యటించారు.

కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్, ఐజీ శివశంకర్, జిల్లా కలెక్టర్ శృతి ఓజా, జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు, ఇతర అధికారులతో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే అతను ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారనే అంశాల ఆధారంగా వ్యక్తులను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు. వారందరిని వెంటనే క్వారంటైన్​కు తరలించి.. నమూనాలను సేకరించాలని సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్​ను నిర్వహించాలని, ఒకేచోట భోజనం, కలిసి ఉండటం లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యారంటైన్​ వ్యర్థాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్​ ఏజెన్సీకి అప్పగించాలని సీఎస్​ సూచించారు.

పోలీస్ యంత్రాంగం తరఫున కరోనా వ్యాధి నియంత్రణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గద్వాల.. ఇతర రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అయినందున.. ఈ ప్రాంతంలోని ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక పైన జిల్లాలో కొత్త కేసులు రాకుండా జిల్లా అధికారులందరూ జట్టుగా పనిచేయాలన్నారు.

జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, నమూనాల సేకరణ, క్వారంటైన్ నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్​ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. 943కు చేరిన కేసులు

జోగులాంబ గద్వాల జిల్లాలో కాంటాక్ట్​ ట్రేసింగ్​ ప్రక్రియ మరింత ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకుమారితో కలిసి ఆయన బుధవారం గద్వాలలోని కంటైన్మెంట్​ ప్రాంతాలైన వేదనగర్, మొమిన్ మోహల్లాలో పర్యటించారు.

కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్, ఐజీ శివశంకర్, జిల్లా కలెక్టర్ శృతి ఓజా, జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు, ఇతర అధికారులతో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే అతను ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారనే అంశాల ఆధారంగా వ్యక్తులను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు. వారందరిని వెంటనే క్వారంటైన్​కు తరలించి.. నమూనాలను సేకరించాలని సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్​ను నిర్వహించాలని, ఒకేచోట భోజనం, కలిసి ఉండటం లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యారంటైన్​ వ్యర్థాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్​ ఏజెన్సీకి అప్పగించాలని సీఎస్​ సూచించారు.

పోలీస్ యంత్రాంగం తరఫున కరోనా వ్యాధి నియంత్రణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గద్వాల.. ఇతర రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అయినందున.. ఈ ప్రాంతంలోని ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక పైన జిల్లాలో కొత్త కేసులు రాకుండా జిల్లా అధికారులందరూ జట్టుగా పనిచేయాలన్నారు.

జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, నమూనాల సేకరణ, క్వారంటైన్ నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్​ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. 943కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.