కృష్ణనదిపై బ్యారేజీతోపాటు వంతెన నిర్మిస్తే అలంపూర్, కొల్లాపూర్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ సమీపంలో నదిని ఆయన పరిశీలించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా బ్యారేజీ నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తానని ఆయన తెలిపారు.
కృష్ణానదిపై బ్యారేజీ కోసం పాదయాత్ర : అద్దంకి దయాకర్
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కృష్ణానదిపై బ్యారేజీతోపాటు వంతెన నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తానని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తెలిపారు. మండలంలోని గొందిమల్ల నుంచి వెల్టూర్ వరకు వంతెనతో పాటు బ్యారేజి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
![కృష్ణానదిపై బ్యారేజీ కోసం పాదయాత్ర : అద్దంకి దయాకర్ Padayatra for construction of barrage on Krishna river by addanki dayakar in jogulamba gadwal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9990314-1091-9990314-1608804612003.jpg?imwidth=3840)
ఈ ప్రాంతంలో బ్యారేజీ ఏర్పాటుచేస్తే నీటిని నేరుగా పాలమూరు-రంగారెడ్డికి మళ్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వంతెన నిర్మిస్తే కొల్లాపూర్ - అలంపూర్ మధ్య రహదారి ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉండటంతో పర్యటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని... ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించాలని అద్దంకి దయాకర్ సూచించారు. సంక్రాంతి తర్వాత కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:బీఆర్ఎస్పై ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలి : హైకోర్టు
కృష్ణనదిపై బ్యారేజీతోపాటు వంతెన నిర్మిస్తే అలంపూర్, కొల్లాపూర్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ సమీపంలో నదిని ఆయన పరిశీలించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా బ్యారేజీ నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తానని ఆయన తెలిపారు.
ఈ ప్రాంతంలో బ్యారేజీ ఏర్పాటుచేస్తే నీటిని నేరుగా పాలమూరు-రంగారెడ్డికి మళ్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వంతెన నిర్మిస్తే కొల్లాపూర్ - అలంపూర్ మధ్య రహదారి ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉండటంతో పర్యటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని... ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించాలని అద్దంకి దయాకర్ సూచించారు. సంక్రాంతి తర్వాత కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.