గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలక ఎన్నికల ఛైర్మన్ అభ్యర్థిగా తెరాస పార్టీ నుంచి బీఎస్ కేశవ్ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోవహన్ రెడ్డి ప్రకటించారు. తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులకు గాను పార్టీ మొదటి జాబితాలో 15మంది కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. తెరాస అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని కృష్ణమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: సీఎం స్వీట్ వార్నింగ్: ఒక్కటి ఓడినా... పదవులు ఊడతయ్!