ETV Bharat / state

'అదిరేటి అందాలున్నా.. కుర్చునేందుకు కుర్చీలు లేవు'

author img

By

Published : Aug 3, 2019, 9:08 PM IST

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎన్నో అందాలకు నెలవు. జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల సందర్శకుల తాకిడి నిత్యం కిటకిటాలాడుతోంది. జలసిరి ధ్వనులు.. చల్లని గాలులు.. కనిపించేంత దూరం పచ్చదనంతో వర్దిల్లుతున్నా.. అంతే రీతిలో వసతులు లేమి పర్యటకులకు ఇబ్బందులకు గురిచేస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇక్కడ పార్కు నిర్మాణానికి హామీ ఇచ్చినా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

'అదిరేటి అందాలున్నా.. కుర్చునేందుకు కుర్చీలూ లేవు'

అల్లంత దూరాన అలల సవ్వడులు.. చల్లని పిల్ల గాలులు.. కళ్లార్పకుండా చూద్దామనేంత ప్రకృతి సౌందర్యం.. ఇవన్నీ జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టు సొంతం. గద్వాల దగ్గల్లో ఇంత మంచి ప్రాంతముందా.. ఐతే మనమూ ఓసారి వెళ్లోచ్చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని అవస్థలు పడాలి మరి. ఇక్కడ పేరుకే పర్యటక ప్రాంతం కానీ కూర్చుందామంటే కుర్చీలుండవ్​. తాగుదామంటే మంచి నీరు దొరకదు. కనీసం నిలువ నీడ దొరకని పరిస్థితి. పాలకులు, అధికారుల అలసత్వమే ఇందుకు కారణం.

11 టీఎంసీల సామర్థ్యంతో 1981లో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1996లో ప్రాజెక్టు పూర్తయింది. రోజూ వందలాది మంది పర్యటకులు ప్రాజెక్టును చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద తాకిడి మొదలైనందున ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ వసతుల లేమి పర్యటకులని అవస్థలకు గురిచేస్తుంది.

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే పార్కు కోసం రూ.6 కోట్లు కేటాయించినా పనులు చేయని కారణంగా నిధులు వెనక్కి వెళ్లాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ.15 కోట్లతో బృందావనం పార్కు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టును చూసేందుకు వచ్చామని కనీసం నిలువ నీడ లేదని పర్యటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వస్తే తలదాచుకోవడానికి.. దాహం వేస్తే తాగునీటికి వసతులు లేవని.. ప్రభుత్వం వెంటనే స్పందించి సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతున్నారు. ప్రకృతి రమణీయమైన జూరాల ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసి మరింత మందికి చేరువ చేయాలి.

'అదిరేటి అందాలున్నా.. కుర్చునేందుకు కుర్చీలూ లేవు'

ఇదీ చూడండి: వానకాలం చదువులంటే ఇవేనేమో..!

అల్లంత దూరాన అలల సవ్వడులు.. చల్లని పిల్ల గాలులు.. కళ్లార్పకుండా చూద్దామనేంత ప్రకృతి సౌందర్యం.. ఇవన్నీ జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టు సొంతం. గద్వాల దగ్గల్లో ఇంత మంచి ప్రాంతముందా.. ఐతే మనమూ ఓసారి వెళ్లోచ్చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని అవస్థలు పడాలి మరి. ఇక్కడ పేరుకే పర్యటక ప్రాంతం కానీ కూర్చుందామంటే కుర్చీలుండవ్​. తాగుదామంటే మంచి నీరు దొరకదు. కనీసం నిలువ నీడ దొరకని పరిస్థితి. పాలకులు, అధికారుల అలసత్వమే ఇందుకు కారణం.

11 టీఎంసీల సామర్థ్యంతో 1981లో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1996లో ప్రాజెక్టు పూర్తయింది. రోజూ వందలాది మంది పర్యటకులు ప్రాజెక్టును చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద తాకిడి మొదలైనందున ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ వసతుల లేమి పర్యటకులని అవస్థలకు గురిచేస్తుంది.

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే పార్కు కోసం రూ.6 కోట్లు కేటాయించినా పనులు చేయని కారణంగా నిధులు వెనక్కి వెళ్లాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ.15 కోట్లతో బృందావనం పార్కు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టును చూసేందుకు వచ్చామని కనీసం నిలువ నీడ లేదని పర్యటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వస్తే తలదాచుకోవడానికి.. దాహం వేస్తే తాగునీటికి వసతులు లేవని.. ప్రభుత్వం వెంటనే స్పందించి సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతున్నారు. ప్రకృతి రమణీయమైన జూరాల ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసి మరింత మందికి చేరువ చేయాలి.

'అదిరేటి అందాలున్నా.. కుర్చునేందుకు కుర్చీలూ లేవు'

ఇదీ చూడండి: వానకాలం చదువులంటే ఇవేనేమో..!

Intro:Tg_mbnr_09_01_paryataka_ki_Nosukoni_jurala_pkg_ts10049
ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జాతికి అంకితం దాదాపు మూడు దశాబ్దాల కాలం గడిచిన ఇక్కడ పర్యాటక అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల బహిరంగసభలో జూరాల వద్ద బృందావనం పార్కు ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చిన ఇంతవరకు నెరవేరలేదు పోవడం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పర్యాటకులు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరద మొదలైన నందున సందర్శకుల తాకిడి మొదలైంది. మూడు నాలుగు నెలల పాటు జూరాల ప్రాజెక్టు రద్దీగా ఉంటుంది .జిల్లాలో చిన్న చిన్న చెరువులకు కూడా లక్షల ల నిధులు మంజూరు చేసి మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామని ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.
vo:
జూరాల ప్రాజెక్టు ఉ 11 టీఎంసీల సామర్థ్యంతో 1981లో లో శంకుస్థాపన చేశారు 1996లో లో ప్రాజెక్టు పూర్తి అయ్యింది. అప్పటినుండి ఏ ప్రభుత్వము పార్కు ఏర్పాటుకు చేయకపోవడంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. పార్కు ఏర్పాటుకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పార్కు మాత్రం ముందుకు సాగడం లేదు ఇక్కడ పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీడ లేదు తాగేందుకు మంచినీళ్లు దొరకవు వర్షం వస్తే తలదాచుకునేందుకు తడకల షెడ్లు కూడా లేని పరిస్థితి ఈ ప్రాజెక్టు వద్ద నెలకొంది. జూరాల కి వరద ఉద్ధృతి పెరగడంతో ఇక్కడ సందర్శకులు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలనుండి పర్యాటకులు వస్తుంటారు కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 కోట్లు పార్కు కోసం నిధులు కేటాయించినా పనులు సాగక నిధులు వెనక్కి వెళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ గద్వాల బహిరంగసభలో జూరాల వద్ద బృందావన పార్కు కోసం నా సొంత ఖర్చులతో 15 కోట్ల పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండు ఏళ్ళు అయినా నా ఇంతవరకు ఎలాంటి శిలాఫలకం కూడా వేయలేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కు కేటాయించిన స్థలంలో లో మట్టి దిబ్బ లతో దర్శనమిస్తున్నాయి. వర్షం వస్తే కనీసం తలదాచుకునేందుకు అయినా గుడారాలు ఏర్పాటు చేసి , తాగడానికి మంచినీటి వసతి కల్పించ లని పర్యాటకులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి చొరవ తీసుకొని జూరాల వద్ద ఉన్న సమస్యలను పరిష్కరించాలని పర్యాటకులు కోరుతున్నారు.
bytes:
1. రాజు వనపర్తి
2. దామోదర్ రెడ్డి కనుమ నూరు
3 పరుశురాం కల్వకుర్తి
4. ప్రతాప్ గద్వాల
5. లక్ష్మీనారాయణ గద్వాల



Body:babanna
9440569622


Conclusion:jogulamba gadwal disi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.