జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని శాంతినగర్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ తిరుగుతూ హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పట్టణం అభివృద్ధి చెందాలంటే... కాంగ్రెస్నే గెలిపించాలన్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అలంపూర్, ఐజా, వడ్డేపల్లి మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తామని ఓటర్లకు వివరించారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'