ETV Bharat / state

'పాండవుల గుట్టను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం' - జయశంకర్​ భూపాలపల్లి​ జిల్లా తాజా వార్తలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట పరిసరాలను ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.ఎ అక్బర్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్​ అబ్దుల్​ అజీమ్​లు పరిశీలించారు. ఈ సందర్భంగా హరిత జయలో భాగంగా మొక్కలు నాటారు.

We will develop the Pandavula gutta internationally
'పాండవుల గుట్టను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం'
author img

By

Published : Jul 5, 2020, 11:04 AM IST

పాండవుల గుట్టను త్వరలో అంతర్జాతీయ స్థాయిలో మెగా బొటానికల్ గార్డెన్​గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.ఎ అక్బర్​తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరిత జయలో భాగంగా మొక్కలు నాటారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం..

చారిత్రాత్మక ప్రాధాన్యం గల పాండవుల గుట్టకు ట్రెక్కింగ్ కోసం ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని.. ఇక్కడికి వచ్చే పర్యటకులు 2,3 రోజులు ఇక్కడే బస చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగానే ఉన్నందున పర్యటకులు విశేషంగా వస్తారన్నారు. మౌంటెన్ ట్రెక్కింగ్​తో పాటు నైట్ క్యాంపింగ్, బోటింగ్, రిసార్ట్స్, కాటేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

ప్రభుత్వానికి నివేదిస్తాం..

పాండవుల గుట్ట ప్రాంతంలో సుమారు 3200 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని కలెక్టర్​ పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే పర్యటక రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుందని.. గుట్ట ప్రాంగణాన్ని మెగా బొటానికల్ గార్డెన్​గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేస్తే అంతర్జాతీయంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె.పురుశోత్తం, జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి చంద్రమౌళి, తహసీల్దార్ జివాకర్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: కరోనా లేదని చెప్పినా వైద్యం చేయలేదు.. చివరికి...

పాండవుల గుట్టను త్వరలో అంతర్జాతీయ స్థాయిలో మెగా బొటానికల్ గార్డెన్​గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పాలనాధికారి మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.ఎ అక్బర్​తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరిత జయలో భాగంగా మొక్కలు నాటారు.

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం..

చారిత్రాత్మక ప్రాధాన్యం గల పాండవుల గుట్టకు ట్రెక్కింగ్ కోసం ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని.. ఇక్కడికి వచ్చే పర్యటకులు 2,3 రోజులు ఇక్కడే బస చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగానే ఉన్నందున పర్యటకులు విశేషంగా వస్తారన్నారు. మౌంటెన్ ట్రెక్కింగ్​తో పాటు నైట్ క్యాంపింగ్, బోటింగ్, రిసార్ట్స్, కాటేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

ప్రభుత్వానికి నివేదిస్తాం..

పాండవుల గుట్ట ప్రాంతంలో సుమారు 3200 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని కలెక్టర్​ పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే పర్యటక రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుందని.. గుట్ట ప్రాంగణాన్ని మెగా బొటానికల్ గార్డెన్​గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేస్తే అంతర్జాతీయంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె.పురుశోత్తం, జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి చంద్రమౌళి, తహసీల్దార్ జివాకర్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: కరోనా లేదని చెప్పినా వైద్యం చేయలేదు.. చివరికి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.