ETV Bharat / state

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేంద్ర మంత్రి కితాబు - Union Minister Jitender Singh video conference with District Collectors

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో కరోనా నియంత్రణ కార్యక్రమాలు సమర్థంగా చేపట్టారని కేంద్ర వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదుల, పింఛన్ల శాఖ మంత్రి డాక్టర్. జితేందర్ సింగ్ అన్నారు. నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్​తో కలిసి ఆస్పిరేషనల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలను, ప్రజలకు కల్పించిన ఆదాయ వనరుల కార్యక్రమాలను ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు.

Union Minister Jitender Singh video conference with District Collectors
జిల్లా కలెక్టర్లతో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్
author img

By

Published : Sep 5, 2020, 11:09 AM IST

ప్రభుత్వ తోడ్పాటు, వైద్య శాఖ, పోలీస్ సిబ్బంది సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించిన జిల్లా యంత్రాంగాలను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్​ అభినందించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా, పాజిటివ్ కేసులు పెరగకుండా సమర్థ చర్యలు తీసుకున్నారన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్​తో కలిసి ఆస్పిరేషనల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించి, వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుని, వారికి కావాల్సిన సరకులను సరఫరా చేసి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని కలెక్టర్లు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేలా, మాస్కులు ధరించే బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వైద్య సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచామని చెప్పారు.

లాక్​డౌన్​ సమయంలో ప్రజలెవరూ పస్తులతో ఉండకుండా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సహకారంతో నిత్యావసర సరకులను అందజేసినట్లు కలెక్టర్లు కేంద్ర మంత్రి జితేందర్​ సింగ్​కు వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పేదలకు పని కల్పించి ఆర్థిక తోడ్పాడు అందించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు శిబిరాలు ఏర్పాటు చేసి వసతి కల్పించామని వెల్లడించారు.

ఎవరూ ఊహించని ఈ హఠాత్పరిణామానికి ప్రపంచం తలకిందులవుతున్న సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన లాక్​డౌన్​ పిలుపుతో దేశంలోని రాష్ట్రాలన్ని సమర్థంగా అమలు జరిగిందని ఇదే సమయంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కరోనా నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా చేపట్టారని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభినందించారు. ఒక వైపు కరోనా వైరస్ భయం ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం ప్రజల సేవకు చూపిన చొరవ అత్యంత అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆస్పిరేషనల్​ జిల్లాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ తోడ్పాటు, వైద్య శాఖ, పోలీస్ సిబ్బంది సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించిన జిల్లా యంత్రాంగాలను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్​ అభినందించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా, పాజిటివ్ కేసులు పెరగకుండా సమర్థ చర్యలు తీసుకున్నారన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్​తో కలిసి ఆస్పిరేషనల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించి, వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుని, వారికి కావాల్సిన సరకులను సరఫరా చేసి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని కలెక్టర్లు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేలా, మాస్కులు ధరించే బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వైద్య సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచామని చెప్పారు.

లాక్​డౌన్​ సమయంలో ప్రజలెవరూ పస్తులతో ఉండకుండా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సహకారంతో నిత్యావసర సరకులను అందజేసినట్లు కలెక్టర్లు కేంద్ర మంత్రి జితేందర్​ సింగ్​కు వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పేదలకు పని కల్పించి ఆర్థిక తోడ్పాడు అందించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు శిబిరాలు ఏర్పాటు చేసి వసతి కల్పించామని వెల్లడించారు.

ఎవరూ ఊహించని ఈ హఠాత్పరిణామానికి ప్రపంచం తలకిందులవుతున్న సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన లాక్​డౌన్​ పిలుపుతో దేశంలోని రాష్ట్రాలన్ని సమర్థంగా అమలు జరిగిందని ఇదే సమయంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కరోనా నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా చేపట్టారని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభినందించారు. ఒక వైపు కరోనా వైరస్ భయం ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం ప్రజల సేవకు చూపిన చొరవ అత్యంత అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆస్పిరేషనల్​ జిల్లాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.