ETV Bharat / state

pranahitha pushkaralu: ప్రాణహిత పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. నేడు మరింత పెరిగే ఛాన్స్​

author img

By

Published : Apr 16, 2022, 5:00 AM IST

Updated : Apr 16, 2022, 6:51 AM IST

pranahitha pushkaralu: ప్రాణహిత పుష్కరాల్లో భక్తజన సందడి కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తోన్న భక్తులతో నదీతీరం పరవశించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తదితర రాష్ట్రాల నుంచి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ పౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రాణహిత పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. నేడు మరింత పెరిగే ఛాన్స్​
ప్రాణహిత పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. నేడు మరింత పెరిగే ఛాన్స్​
ప్రాణహిత పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. నేడు మరింత పెరిగే ఛాన్స్​

pranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం భక్తులతో కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట, కుమురంభీం జిల్లా తుమ్మడిహెట్టి పుష్కర ఘాట్లలో పుణ్య స్నానాలతో పాటు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కాళేశ్వరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నదీ హారతిని ఘనంగా నిర్వహించారు.

మంచి అనుభూతి..

పుష్కర స్నానం ఎంతో పుణ్య ఫలమని.. అందుకే వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని భక్తులు తెలిపారు. పుష్కరాల్లో ఎడ్లబండ్లు ప్రత్యేక ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఎడ్ల బండ్ల మీద కొంత దూరం వెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. ఎడ్ల బండ్ల మీద ప్రయాణం మంచి అనుభూతిని ఇచ్చిందని భక్తులు తెలిపారు. మరోవైపు తమకు ఉపాధి లభించిందని ఎడ్ల బండ్ల యజమానులు పేర్కొన్నారు.

భక్తుల ఆగ్రహం..

కాళేశ్వరం మీదుగా వచ్చే వాహనాలను అధికారులు మహారాష్ట్రలోని సిరోంచ, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట పుష్కర ఘాట్లకు తరలిస్తున్నారు. దీంతో ఈ పుష్కరఘాట్లలో రద్దీ పెరిగింది. త్రివేణి సంగమంలో స్నానాలు చేయాలనుకునే వారిని సైతం సిరోంచ వైపు మళ్లించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఈ ఆర్థిక ఏడాదికి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం టార్గెట్ ఎంతంటే.?

మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్​

ప్రాణహిత పుష్కరాల్లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. నేడు మరింత పెరిగే ఛాన్స్​

pranahitha pushkaralu: ప్రాణహిత నదీ తీరం భక్తులతో కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట, కుమురంభీం జిల్లా తుమ్మడిహెట్టి పుష్కర ఘాట్లలో పుణ్య స్నానాలతో పాటు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కాళేశ్వరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నదీ హారతిని ఘనంగా నిర్వహించారు.

మంచి అనుభూతి..

పుష్కర స్నానం ఎంతో పుణ్య ఫలమని.. అందుకే వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని భక్తులు తెలిపారు. పుష్కరాల్లో ఎడ్లబండ్లు ప్రత్యేక ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఎడ్ల బండ్ల మీద కొంత దూరం వెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. ఎడ్ల బండ్ల మీద ప్రయాణం మంచి అనుభూతిని ఇచ్చిందని భక్తులు తెలిపారు. మరోవైపు తమకు ఉపాధి లభించిందని ఎడ్ల బండ్ల యజమానులు పేర్కొన్నారు.

భక్తుల ఆగ్రహం..

కాళేశ్వరం మీదుగా వచ్చే వాహనాలను అధికారులు మహారాష్ట్రలోని సిరోంచ, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట పుష్కర ఘాట్లకు తరలిస్తున్నారు. దీంతో ఈ పుష్కరఘాట్లలో రద్దీ పెరిగింది. త్రివేణి సంగమంలో స్నానాలు చేయాలనుకునే వారిని సైతం సిరోంచ వైపు మళ్లించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఈ ఆర్థిక ఏడాదికి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం టార్గెట్ ఎంతంటే.?

మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్​

Last Updated : Apr 16, 2022, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.