కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులు, కోర్టు ఆఫీసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఆయన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సిబ్బందికి అదనపు ఎస్పీ సూచించారు. నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేసి ప్రజలలో పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, హథీరామ్, మోహన్, శ్రీనివాస్, సైదారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'నమ్ముకున్న పొలమే కాటేసిందానే.. అన్న'