ETV Bharat / state

'పంటలు ఎండిపోతున్నాయ్... నీరందించండి' - సాగునీటికోసం రైతుల ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లి రైతులు ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోతున్నాయని... కాలువ ద్వారా నీరు అందించాలని కోరారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

farmers protest for water facility to Irrigation in jayashankar bhupalpally
'పంటలు ఎండిపోతున్నాయ్... నీరందించండి'
author img

By

Published : Nov 17, 2020, 11:34 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి రైతులు ధర్నా చేశారు. తమ వరి పొలాలు ఎండిపోతున్నాయని... కెనాల్ ద్వారా నీరందించి అన్నదాతలను ఆదుకోవాలని భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. కాలువ ద్వారా నీటిని రాకుండా చేస్తున్నారని... ఫలితంగా చేతికి వచ్చిన వరి పంట ఎండి పోతుందని వాపోయారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి రేగొండ పోలీసులు చేరుకున్నారు. రైతులకు తక్షణమే కాలువ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి రైతులు ధర్నా చేశారు. తమ వరి పొలాలు ఎండిపోతున్నాయని... కెనాల్ ద్వారా నీరందించి అన్నదాతలను ఆదుకోవాలని భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. కాలువ ద్వారా నీటిని రాకుండా చేస్తున్నారని... ఫలితంగా చేతికి వచ్చిన వరి పంట ఎండి పోతుందని వాపోయారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి రేగొండ పోలీసులు చేరుకున్నారు. రైతులకు తక్షణమే కాలువ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఇదీ చదవండి: సన్నరకం సాగుతో సగం దిగుబడి నష్టపోయాం: రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.