ETV Bharat / state

నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజి.. 15 గేట్ల ద్వారా నీటి విడుదల - జయశంకర్​ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు

మహారాష్ట్ర, ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజి 15 గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 11.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Downstream of water from Medigadda project
నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజి.
author img

By

Published : Jun 18, 2021, 10:05 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో... కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటేత్తుతోంది.

బ్యారేజిలోని 85 గేట్లకు గానూ 15 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 53 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా... గేట్ల ద్వారా 23,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ఇప్పటికే 11.6 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.

నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజి.

ఇదీ చదవండి: ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం

కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో... కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటేత్తుతోంది.

బ్యారేజిలోని 85 గేట్లకు గానూ 15 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 53 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా... గేట్ల ద్వారా 23,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ఇప్పటికే 11.6 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.

నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజి.

ఇదీ చదవండి: ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.