ETV Bharat / state

మూడు రోజుల వ్యవధిలో కరోనాతో దంపతులు మృతి

author img

By

Published : May 31, 2021, 7:21 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కొవిడ్ బారిన పడి దంపతులు మృతి చెందారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ మరణించారు. వారి కొడుకు, కోడలూ కరోనాతో బాధపడుతున్నారు.

couple died with corona, corona deaths
కరోనాతో దంపతులు మృతి, కొవిడ్​తో భార్యభర్తలు మృతి

కరోనా మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది. కొవిడ్​తో భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మరోవైపు వీరి కొడుకు పాషా, కోడలు షమా కరోనాతో బాధపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన సత్తార్ హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతూ సత్తార్ భార్య రబునిసా ఆదివారం మృతిచెందింది. ఇద్దరి చికిత్స కోసం రూ.10 లక్షల దాకా ఖర్చయినట్లు పాషా తెలిపారు. ఆమె అంత్యక్రియలకు బంధువులు దూరంగా ఉండడంతో ఉపసర్పంచ్ పోతర్ల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కరోనా మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది. కొవిడ్​తో భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మరోవైపు వీరి కొడుకు పాషా, కోడలు షమా కరోనాతో బాధపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన సత్తార్ హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతూ సత్తార్ భార్య రబునిసా ఆదివారం మృతిచెందింది. ఇద్దరి చికిత్స కోసం రూ.10 లక్షల దాకా ఖర్చయినట్లు పాషా తెలిపారు. ఆమె అంత్యక్రియలకు బంధువులు దూరంగా ఉండడంతో ఉపసర్పంచ్ పోతర్ల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇదీ చదవండి: coronavirus india: దేశంలో కొత్తగా 1.52లక్షల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.