ETV Bharat / state

పాము కాటుకు విద్యార్థిని మృతి.. ఆవిరైన తల్లిదండ్రుల ఆశలు - జనగామలో పాము కాటుకు విద్యార్థిని మృతి

జనగామ జిల్లా లింగాలఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో ఓ విద్యార్థిని పాము కాటుతో మరణించింది. ఇంట్రో నిద్రిస్తున్న సమయంలో గంగాభవాని పాము కాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యలు జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎంజీఎంకు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.

ssc student dies of snake bite
ssc student dies of snake bite
author img

By

Published : Jun 24, 2020, 10:53 PM IST

వేముల గంగాభవాని అనే విద్యార్థిని పాము కాటుకు బలైంది. ఇటీవలే విడుదలైన పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణురాలైంది. ఉన్నత చదువులు చదివించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. వారి రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన వేముల అయిలయ్య, సుజాత అంజమ్మ దంపతులు... లింగాలఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో నివాసం ఉంటున్నారు.

మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గంగాభవాని పాముకాటుకు గురైంది. జనగామ ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యలు తరలించగా పరిశీలించిన వైద్యులు బాలికను ఎంజీఎం తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి మార్గమధ్యలో మృతి చెందింది.

వేముల గంగాభవాని అనే విద్యార్థిని పాము కాటుకు బలైంది. ఇటీవలే విడుదలైన పదో తరగతి ఫలితాలలో ఉత్తీర్ణురాలైంది. ఉన్నత చదువులు చదివించాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. వారి రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన వేముల అయిలయ్య, సుజాత అంజమ్మ దంపతులు... లింగాలఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో నివాసం ఉంటున్నారు.

మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గంగాభవాని పాముకాటుకు గురైంది. జనగామ ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యలు తరలించగా పరిశీలించిన వైద్యులు బాలికను ఎంజీఎం తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి మార్గమధ్యలో మృతి చెందింది.

ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.