పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిఖిల ప్రారంభించారు. ఆరో వార్డులో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో కావలసిన అవసరాలపై సమస్యలపై చర్చించారు.
అనంతరం పలు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ మరమ్మతులను ప్రారంభించారు. జనగామ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.