జనగామ జిల్లా పెంబర్తి సర్పంచ్.. నిధుల దుర్వినియోగం కింద సస్పెండ్ అయ్యారు. దీనిపై సర్పంచ్ అంబాల ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించి.. జడ్పీటీసీ-పీఏసీఎస్ ఛైర్మన్ దంపతులు.. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దానికి స్పందించిన జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ జనగామ ఛైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి దంపతులు కూడా విలేకరుల సమావేశం నిర్వహించి, సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అది నిరూపించకుంటే రాజీనామా చేస్తామన్నారు.
"నిన్న సర్పంచ్గా సస్పెండ్ ఆర్డర్ రాగానే విలేకరుల సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఆంజనేయులు.. మాపైన లేనిపోని అబాండాలు వేశారు. నేను 4 నెలల క్రితం నిధులు దుర్వినియోగం చేశారని ఒక ఫిర్యాదు ఇచ్చాను. నేను ఫిర్యాదిచ్చాననే వారు తొలగించరు కదా..! విచారణ చేశాకే సస్పెండ్ చేస్తారు కదా..!"
-నిమ్మతి దీపిక, జడ్పీటీసీ
పెంబర్తి సర్పంచ్ సస్పెన్షన్పై మాటల యుద్ధం
సమాచారం తెలుసుకున్న సర్పంచ్ వర్గీయులు అక్కడకు చేరుకొని జడ్పీటీసీ, పీఏసీఎస్ ఛైర్మన్ను నిలదీశారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకొని సమస్యను సద్దుమణిగించారు.
ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'