ETV Bharat / state

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు

‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతారు’ అంటూ ఓ సినీ రచయిత చెప్పిన మాటలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. వారంతా యువకులు ఓ బృందంగా ఏర్పడి సేవ చేయాలనుకున్నారు. తలో కొంత మొత్తం వేసుకుని ఊర్లో సేవాకార్యక్రమాలు మొదలుపెట్టారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, రక్తదానం, మొక్కల పెంపకం ఇలా ఒకటేమిటి కాదేదీ సేవకు అనర్హం అంటున్నారు ఈ ఆదర్శ యువకులు.

author img

By

Published : Jul 18, 2019, 8:46 PM IST

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు

వారంతా యువకులు... మంచి మనసు.. ఆదర్శ భావాలున్న మార్గదర్శకులు. ఎదగడం అంటే తానొక్కడే కాదు తన చుట్టూ ఉన్న సమాజం ఎదుగేందుకు చేయూతనివ్వడం అని ఎరిగిన మారాజులు. జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన కొందరు యువకులు సమాజానికి ఎదైనా చేయాలనే ఆలోచన ఓ మంచి కార్యానికి బీజం పడింది. ఆరేళ్ల కిందట ఐదుగురు స్నేహితులు కలిసి విద్యార్థులకు నోట్​ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం చేయాలని తలంచారు. ప్రస్తుతం వీరి గ్రూపులో 65 మందివరకు ఉన్నారు.

యువకులంతా ఫ్రెండ్స్​ వెల్ఫేర్​ ట్రస్ట్​ అనే సంస్థను ఏర్పాటు చేసి ఐదేళ్లుగా సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు ఏడాది సరిపడా సామగ్రి అందిస్తూ వారి చదువుకు బాసటగా నిలుస్తున్నారు. ఈ ఏడాది 1500 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్​ను ఉచితంగా అందించారు. జగిత్యాల, కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ తదతర జిల్లాల్లో పర్యటించి పేదరికంలో ఉండి బాగా చదువుతున్న పిల్లలకు అవసరమైన విద్యాసామగ్రి అందిస్తున్నారు. పేద పిల్లలు వీరి సేవల పట్ల సంతోషంగా ఉన్నారు.

ఇతర సేవాకార్యక్రమాలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో కూడా వీరు భాగస్వాములౌతున్నారు. ఏటా సుమారు రెండొందల మొక్కలు నాటి పెంచి పెద్దచేస్తున్నారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులచే మొక్కలు నాటించి వాటిని బాగా పెంచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామంటున్నారు.

అన్నింటా వారి సేవాహస్తం

అంతిమ యాత్రను గౌరవప్రదంగా చేసేందుకు వైకుంఠ రథం పేరిట ప్రత్యేక వాహనం చేయించి పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఎవరికైనా రక్తం అవసరమంటే క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలా అవసరం ఏదైనా సహాయానికి తామున్నామంటూ ఆ యువకులు అందరికీ తల్లో నాలుకలా ఉన్నారు.

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు

ఇదీ చూడండి: చాక్లెట్లు తిన్నంత సులువుగా సాఫ్ట్​వేర్ కోడింగ్​

వారంతా యువకులు... మంచి మనసు.. ఆదర్శ భావాలున్న మార్గదర్శకులు. ఎదగడం అంటే తానొక్కడే కాదు తన చుట్టూ ఉన్న సమాజం ఎదుగేందుకు చేయూతనివ్వడం అని ఎరిగిన మారాజులు. జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన కొందరు యువకులు సమాజానికి ఎదైనా చేయాలనే ఆలోచన ఓ మంచి కార్యానికి బీజం పడింది. ఆరేళ్ల కిందట ఐదుగురు స్నేహితులు కలిసి విద్యార్థులకు నోట్​ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం చేయాలని తలంచారు. ప్రస్తుతం వీరి గ్రూపులో 65 మందివరకు ఉన్నారు.

యువకులంతా ఫ్రెండ్స్​ వెల్ఫేర్​ ట్రస్ట్​ అనే సంస్థను ఏర్పాటు చేసి ఐదేళ్లుగా సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు ఏడాది సరిపడా సామగ్రి అందిస్తూ వారి చదువుకు బాసటగా నిలుస్తున్నారు. ఈ ఏడాది 1500 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్​ను ఉచితంగా అందించారు. జగిత్యాల, కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ తదతర జిల్లాల్లో పర్యటించి పేదరికంలో ఉండి బాగా చదువుతున్న పిల్లలకు అవసరమైన విద్యాసామగ్రి అందిస్తున్నారు. పేద పిల్లలు వీరి సేవల పట్ల సంతోషంగా ఉన్నారు.

ఇతర సేవాకార్యక్రమాలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో కూడా వీరు భాగస్వాములౌతున్నారు. ఏటా సుమారు రెండొందల మొక్కలు నాటి పెంచి పెద్దచేస్తున్నారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులచే మొక్కలు నాటించి వాటిని బాగా పెంచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామంటున్నారు.

అన్నింటా వారి సేవాహస్తం

అంతిమ యాత్రను గౌరవప్రదంగా చేసేందుకు వైకుంఠ రథం పేరిట ప్రత్యేక వాహనం చేయించి పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఎవరికైనా రక్తం అవసరమంటే క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలా అవసరం ఏదైనా సహాయానికి తామున్నామంటూ ఆ యువకులు అందరికీ తల్లో నాలుకలా ఉన్నారు.

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు

ఇదీ చూడండి: చాక్లెట్లు తిన్నంత సులువుగా సాఫ్ట్​వేర్ కోడింగ్​

Intro:TG_KRN_13_17_Adharsha yuvakulu_pkg._TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: వారంతా యువకులు ఏదో ఒక వృత్తి చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు వీరందరూ కలిసి పేద పిల్లలకు అండగా అందరూ చదువుకునేలా ప్రోత్సహించాలని అనుకున్నారు అనుకున్నదే తడవుగా వారు సంపాదించి దాని లో లో తలు కొంత వేసుకుని సుమారు వెయ్యి మంది విద్యార్థులకు సంవత్సరంపాటు కావలసిన స్టడీ మెటీరియల్ అందించి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు
వాయిస్
నడుచుకుంటూ వస్తున్న ఈ యువకులు అందరిదీ జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన వారు వీరంతా సమయాన్ని వృధా చేయకుండా పేదలకు సాయం అందించి అందరికీ చదువు వచ్చేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో గత ఆరేళ్ల క్రితం ఐదుగురు స్నేహితులు కలిసి కొంత మంది పేద విద్యార్థులను ఎంపిక చేసుకుని notebooks పెన్నులు పంపిణీ చేసి పూర్తి గా నిలిచారు అప్పటినుంచి స్నేహితులు ఒకరు ఒకరు సుమారు 65 మంది చేరారు వీరు ఏదో ఒక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వీరందరి ఆలోచన అందరూ చదవాలి అందరూ బాగుండాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు దీంతో ఎంతో మంది పేద పిల్లలు చదువుకోవాలని ఉన్నా notebooks కు డబ్బులు లేక చదవలేని వారు చాలామంది ఉన్న విషయాన్ని తెలుసుకున్న వీరు ఫ్రెండ్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకున్నారు ట్రస్ట్ నుంచి గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలకు సంవత్సరానికి సరిపడా సామాగ్రిని అందిస్తూ వారి చదువుకు అండగా నిలుస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదే స్పూర్తితో సుమారు 1500 మంది పేద విద్యార్థులకు ఎంపిక చేసుకొని వారికి ఏడాది పాటు కావలసిన స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందించి అండగా నిలిచారు కేవలం జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ తదితర జిల్లాల్లో పర్యటించి మారుమూల ప్రాంతాలను ఎంపిక చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను సహకరిస్తూ వారి చదువులు చక్కదిద్దుతారు ఇప్పటివరకు ఈ సంవత్సరం ఆరు లక్షల ఖర్చుతో 1500 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యులు బుక్కులను అందిస్తూనే మరిన్ని సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో మీరు భాగస్వాములు గా ఏర్పడి ప్రతియేటా రెండు వందల మొక్కలను నాటి వాటికి రికార్డ్ ను ఏర్పాటు చేసి మొక్క పెరిగి ల రక్షణ గా ఉంటున్నారు మొక్కలు ఏపుగా పెంచిన వారికి ప్రోత్సహిస్తూ పలు బహుమతులు అందిస్తూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి అంతిమ యాత్రను గౌరవప్రదంగా ఉండేందుకు వైకుంఠ రథం పేరిట ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించి పేదలకు అందిస్తున్నారు దీంతోపాటు ఆపరేషన్లు చేయించుకున్న సమయంలో అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి మేమున్నామంటూ ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందించి వారికి ఆరో ప్రాణాన్ని అందిస్తున్నారు ఇలా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ యువకులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు
బైట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇబ్రహీంపట్నం
surigi శ్రీనివాస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు మెట్పల్లి
ట్రస్ట్ సభ్యులు
పాఠశాల విద్యార్థిని ఇబ్రహీంపట్నం


Body:yuvakudu


Conclusion:TG_KRN_13_17_Adharsha yuvakulu_pkg._TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.