ETV Bharat / state

మరణంలోనూ తోడు.. కరోనా సోకి భార్యాభర్తలు మృతి - wife and husband died of corona in rayikal

జగిత్యాల జిల్లా రాయికల్​లో విషాదం నెలకొంది. ఏడడుగుల బంధం కరోనా కాటుకు బలైంది. మహమ్మారి సోకి భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

wife and husband died of corona
కరోనాతో భార్యాభర్తలు మృతి
author img

By

Published : Apr 26, 2021, 3:56 PM IST

జగిత్యాల జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రాయికల్‌ మండల కేంద్రంలో అనంతుల అశోక్‌, భార్య లత కరోనాతో మృత్యువాత పడ్డారు. వారం క్రితం దంపతులిద్దిరికీ కొవిడ్​ సోకింది. ఇద్దరూ హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.

దంపతుల మృతితో మండలకేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

జగిత్యాల జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రాయికల్‌ మండల కేంద్రంలో అనంతుల అశోక్‌, భార్య లత కరోనాతో మృత్యువాత పడ్డారు. వారం క్రితం దంపతులిద్దిరికీ కొవిడ్​ సోకింది. ఇద్దరూ హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.

దంపతుల మృతితో మండలకేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వరుస మరణాలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

ఇదీ చదవండి: క్యాబ్​ సర్వీస్​ను సద్వినియోగం చేసుకోవాలి: రాచకొండ సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.