ఆర్టీసీ కార్మికుల సమ్మె 28వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు.
ఇవాళ డిపో గేటు ముందు నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కార్మికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'